వన్డే ప్రపంచ కప్‌ విజేతకు రూ. 33 కోట్లు

ABN , First Publish Date - 2023-09-23T02:23:39+05:30 IST

వచ్చేనెల భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం పది జట్లు పోటీపడే ఈ టోర్నీ...

వన్డే ప్రపంచ కప్‌ విజేతకు రూ. 33 కోట్లు

దుబాయ్‌: వచ్చేనెల భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం పది జట్లు పోటీపడే ఈ టోర్నీ ఓవరాల్‌ ప్రైజ్‌మనీ రూ. 83 కోట్లు. కప్పు గెలిచిన విజేత జట్టుకు 4 మిలియన్‌ డాలర్లు అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ. 33.18 కోట్లు దక్కనుంది. ఫైనల్లో ఓడిన రన్నరప్‌ జట్టు రూ. 16.59 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లు రూ. 6.63 కోట్ల చొప్పున స్వీకరించనున్నాయి. ఇక నాకౌట్‌ చేరడంలో విఫలమైన మిగిలిన ఆరు జట్లకు రూ. 83 లక్షల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. అలాగే గ్రూప్‌ దశలోని ప్రతి మ్యాచ్‌ (మొత్తం 45 మ్యాచ్‌లు) విజయానికి రూ. 33.17 లక్షలను అందుకుంటాయి.

Updated Date - 2023-09-23T02:23:39+05:30 IST