Padma Awards 2023: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు.. ఎవరెవరంటే..

ABN , First Publish Date - 2023-01-25T22:21:09+05:30 IST

విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో రాణించిన, రాణిస్తున్న మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు.

Padma Awards 2023: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు.. ఎవరెవరంటే..

న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన ఈ జాబితాలో 9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రముఖలు ఉన్నారు.

తెలంగాణ పద్మాలు వీరే..

పద్మభూషణ్ గ్రహీతలు

1. చిన్నజీయర్ స్వామి - ఆధ్యాత్మిక

2. కమలేష్ డి పటేల్ - ఆధ్మాత్మిక

పద్మశ్రీ గ్రహీతలు..

1. మోదడుగు విజయ్ గుప్తా - సైన్స్ రంగం

2. పసుపులేటి హనుమంతరావు - వైద్య రంగం

3. బీ.రామకృష్ణా రెడ్డి - విద్యా సాహిత్యం.

Updated Date - 2023-01-25T23:55:20+05:30 IST