Share News

Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

ABN , Publish Date - May 28 , 2024 | 05:13 AM

ప్రముఖ బిల్డర్‌, కుత్బుల్లాపూర్‌ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్‌ కుప్పా ల మధు(49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు.

 Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

బీరుబాటిళ్లతో పొడిచి చంపిన స్నేహితులు!

జీడిమెట్ల, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖ బిల్డర్‌, కుత్బుల్లాపూర్‌ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్‌ కుప్పా ల మధు(49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ నుంచి మధు, తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్‌కు వెళ్లా డు. అక్కడ డబ్బు విషయంలో తలెత్తిన వివాదంతో ఆ స్నేహితులే బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా కడుపులో పొడిచి హత్యచేసి పారిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హతుడి నుం చి రూ.20 లక్షల విలువ చేసే బంగారం, రూ.కోటి నగదును తీసుకుని ఉడాయించినట్లు తెలుస్తుంది. మధు స్వస్థలం కోనసీమ జిల్లాలోని అమలాపురం.

30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కొచ్చి కుత్బుల్లాపూర్‌లో మణికంఠ ట్రావెల్స్‌ పేరుతో కార్లు అద్దెకిచ్చేవాడు. కొన్నాళ్ల క్రితం బిల్డర్‌ మారాడు. మధుది మొదటి నుంచీ క్యాసినోలో అందెవేసిన చేయి అని, క్యాసినోలో ఆయన్ను మించినవారు లేరని స్నేహితులు చెబుతారు. ఆయన క్యాసినోకి వెళితే ఇంటికి రూ.లక్షలు తీసుకురావడమే తప్ప పోవడం అంటూ ఉండదని అంటారు.

క్యాసినో ద్వారా పేరొందిన చీకోటి ప్రవీణ్‌తో మధు సత్సంబందాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. క్యాసినో ఏజెంట్‌గా మారిన మధు.. గోవా, మలేసియా, బెంగళూర్‌, కర్ణాటక, సింగపూర్‌, దుబాయ్‌లకు వెళ్లి క్యాసినోలో పాల్గొనేవాడని తెలుస్తుంది. జనసేన పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్న మధు ఇటీవల పిఠాపురంలో పవన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. ఏపీలోని తన సొంతూర్లో ఇల్లు కట్టుకుంటున్నాడు.

తన రెండో కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో ఆగస్టులో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 23న ఊరు నుంచి వచ్చిన మధు, ఆ మర్నాడు తన స్నేహితులు రేణుకా ప్రసాద్‌, నిఖిత్‌, పి.గోపీతో కారులో బయటకు వెళ్లాడు. కాసేపటికి భార్యకు ఫోన్‌చేసి తాను స్నేహితులతో బీదర్‌ పోతున్నానని చెప్పాడు.

Updated Date - May 28 , 2024 | 05:14 AM