Share News

‘షాంఘై’లో బోపన్న జోడీ ముందంజ

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:06 AM

భారత టెన్నిస్‌ డబుల్స్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న షాంఘై మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశాడు.

‘షాంఘై’లో బోపన్న జోడీ ముందంజ

షాంఘై: భారత టెన్నిస్‌ డబుల్స్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న షాంఘై మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఆరంభ రౌండ్లో ఐదో సీడ్‌ బోపన్న/ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంట 6-4, 6-3తో స్పెయిన్‌ ద్వయం పాబ్లో కారెనో బస్టా/పెడ్రో మార్టినెజ్‌పై వరుససెట్లలో గెలుపొందింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ఇప్పటికే ముగిసింది. రామ్‌కుమార్‌, సుమిత్‌ నగాల్‌ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు.

Updated Date - Oct 05 , 2024 | 02:06 AM