Share News

BRS: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

ABN , Publish Date - Oct 11 , 2024 | 09:42 PM

సీఎం రేవంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. "సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి.

BRS: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

హైదరాబాద్: సీఎం రేవంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. "సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొందుర్గులో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీలను గొర్రెలకు బర్రెలకు పరిమితం చేశారని రేవంత్ నింద వేయడంపై అన్ని వివరాలతో శనివారం మీడియా ముందుకు వస్తా.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుండి ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి సెలక్ట్ అయ్యారు. వాళ్ల ఛార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వట్లేదట. మరి ఆ పిల్లలు ఇక గొర్రెలు బర్రెలు కాయకపోతే ఏం చేస్తరు? కేసీఆర్ పాలనలో ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షల రూపాయల సాయం అందేది. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని" అని ప్రవీణ్ పేర్కొన్నారు.


రేవంత్ ఏమన్నారంటే..

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా పాఠశాలలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. "దసరా నాలుగు కోట్ల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని కోరుకుంటున్న. ప్రభుత్వం ఏర్పడిన రోజునే వాగ్దానం చేశాం. రాష్ట్రాన్ని విద్యా, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పాం. బీఆర్ఎస్ సర్కార్ ఐదు వేల పాఠశాలలను మూసివేసి.. అణగారిన వర్గాలకు విద్యకు దూరం చేసింది. అందుకే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నాం.

అందుకే విద్యా శాఖలో సంపూర్ణంగా మార్పులు చేశాం. కోరుకున్న విధంగా బదిలీలు జరిపాం. ఏ చిన్న పొరపాటు లేకుండా 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి ఇచ్చాం. అధికారులతోనే ఇది సాధ్యపడింది. ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ఏనాడూ విద్యాభివృద్ధికి కృషి చేయలేదు. పేదలు చదవకూడదన్నది వారి ఉద్దేశం. PV నరసింహారావు 1971 లో గురుకుల విద్యా వ్యవస్థను తెచ్చారు. అందులో చదివిన ఎంతోమంది నిరుపేదలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన గురుకులాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా. కనీస వసతులు కల్పించలేదు. ఈ విషయాలు నగ్న సత్యాలు. వీటిని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం.. మీరు ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. కానీ మీరు కూడా పేదలకు విద్య అవసరం లేదని అనుకుంటున్నారా. బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. కుల వృత్తులకే పరిమితం కావాలా. పిల్లలకు చదువు చెప్పడం, పేదలకు వైద్యం అందించడం మా విధానం. మీ విధానం, మీరు సీఎం కావడం, కొడుకు, అల్లుడిని మంత్రిని చేయడం, మరొకరిని ఎంపీని చేయడం. వాళ్లందరినీ ఓడించినా బుద్ధి మారలేదు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించేందుకే రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నాం. బీఆర్ఎస్ నేతలకు వారి పార్టీ కార్యాలయాలకు భూమి ఉంటుంది కానీ, బడులు కట్టడానికి భూమి, నిధులు ఉండవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలుంటే వారిలో కల్మషాలు పెరగవచ్చు. కనుక అందరినీ ఓకే దగ్గర చదివిస్తే సోదర భావం పెరుగుతుందని ఇలాంటి సమీకృత పాఠశాలలను కట్టాలనే ఆలోచన వచ్చింది" అని రేవంత్ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 09:44 PM