Share News

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ABN , Publish Date - Oct 05 , 2024 | 06:10 AM

ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు.

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

హైదరాబాద్: ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అర్ధరాత్రి 12:40 తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి చేయిదాటి పోవటంతో గాయత్రి కన్నుమూశారు. కాగా.. ఆదివారం గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది.

ప్రముఖుల పరామర్శ..

రాజేంద్రప్రసాద్‌ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్‌ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారన్నారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి..’ అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు చెప్పారు.

For Latest news and National News click here

Updated Date - Oct 05 , 2024 | 08:01 AM