Share News

Andhra Pradesh: డీపీఆర్‌లు ఇవ్వకపోతే మా కేటాయింపుల్లో కోత విధిస్తారా?

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:14 AM

గోదావరి నదిపై చేపడుతున్న పథకాల డీపీఆర్‌లు సమర్పించకపోవడం వలన, గోదావరి ట్రైబ్యునల్‌ నుంచి తమకు కేటాయించిన నీటిలో కోత ఎలా విధిస్తారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేంద్ర జల సంఘాన్ని ప్రశ్నించింది. కేంద్ర జలసంఘం చైర్మన్‌తో జరిగిన సమావేశంలో ఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన వాదనలు వినిపించింది.

Andhra Pradesh: డీపీఆర్‌లు ఇవ్వకపోతే మా కేటాయింపుల్లో కోత విధిస్తారా?

జలసంఘాన్ని నిలదీసిన ఆంధ్ర

గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు మేరకు నీళ్లు వాడుకుంటామని స్పష్టీకరణ

భేటీని బహిష్కరించిన తెలంగాణ

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): చింతలపూడి సహా గోదావరి నదిపై నిర్మిస్తున్న పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లు ఇవ్వనంత మాత్రాన గోదావరి ట్రైబ్యునల్‌ తమకు కేటాయించిన నీటిలో ఎలా కోత విధిస్తారని కేంద్ర జల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ నిలదీసింది. సోమవారం ఢిల్లీలో జలసంఘం చైర్మన్‌ ఎం.సిన్హా, సభ్యుడు భూపాల్‌సింగ్‌, సీఈ సంజయ్‌కుమార్‌ తదితరుల సమక్షంలో జరిగిన ఈ భేటీని తెలంగాణ బహిష్కరించగా.. ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ సుగుణాకరరావు తమ వాదనలు వినిపించారు. గోదావరి జలాల్లో ఏపీకి 660 టీఎంసీల వాటా ఉందని వెల్లడించారు. పోలవరం నిర్మాణం పూర్తయ్యాక మరో 320 టీఎంసీలు వాడుకుంటామన్నారు. గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్‌ అవార్డు మేరకు నీళ్లు వాడుకుంటామని స్పష్టం చేశారు. చింతలపూడి సహా మరికొన్ని ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉందని తెలిపారు. కేటాయింపులే లేకపోయినా తెలంగాణ డీపీఆర్‌లు సమర్పించినంత మాత్రాన అక్రమంగా నిర్మించిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అలాగే.. ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి లభ్యత ఉందని.. ఇందులో 969 టీఎంసీలు తెలంగాణకు వస్తాయంటూ 2019లో అప్పటి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు జలసంఘానికి లేఖ రాశారని.. ఎవరూ నిర్ధారించకుండా ఆ 969 టీఎంసీలను హక్కుగా ఎలా భావిస్తారని నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:14 AM