Home » Andhra Pradesh
Andhrapradesh: ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అరాచకం ఒకటి వెలుగు చూసింది. నందిగామ మండలం కంచలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ చెబుతోంది. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని వైసీపీ మూకలు దాడికి దిగాయి.
‘మా వీధిలో బోరు వేయించండి. గుడి నిర్మాణానికి సా యం చేయండి. మాకు రోడ్డు వేయించండి’ ఒకప్పుడు ఓట్లు అడగడానికెళ్లే అభ్యర్థులకు ఇలాంటి డిమాండ్లు ఎదురయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ట్రెండ్ మారింది.
ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
జిల్లాలో ఈనెల 13వ తేదీ సాయంతరం వరకు 48 గంటల పాటు ఎవరూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ అమిత బర్దర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 13న జరిగే పోలింగ్ ప్రక్రియలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిబంధన మేరకు శనివారం సాయంత్రం నుంచి ..
Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..
పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఒక రోజు ముందు నుంచే పోలీసు బలగాలు పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎం తరలించినప్పటి నుంచి ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ముగ్గుతో గీస్తారు.