Tirumala: శ్రీవారి వైభవం చాటిచెప్పేలా డిజిటల్ మీడియా
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:10 AM
తిరుమల శ్రీవారి భక్తులకు అందుతున్న సేవల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అసెంబ్లీ అంచనాల కమిటీ అభిప్రాయపడింది. పరిశుభ్రత, గదుల నిర్వహణతోపాటు డిజిటల్ మీడియా వాడకాన్ని పెంచాలని సూచించారు.
వసతి గదుల నిర్వహణపై పర్యవేక్షణ ఉండాలి
టీటీడీకి అసెంబ్లీ అంచనాల కమిటీ సూచన
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులకు గతంలో కంటే ఇప్పుడు అందుతున్న సేవల్లో మార్పు కనిపిస్తోందని ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ పేర్కొంది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, సభ్యులు టీటీడీ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, వసతి గదుల నిర్వహణపైనా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News