Vallabhaneni Vamsi: వంశీకి రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:15 AM
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పది మందికి రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఈ నిందితుల రిమాండ్ను మే 7 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పది మంది నిందితుల రిమాండ్ను కోర్టు పొడిగించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగారావుతో పాటు మరో ఇద్దరిని ప్రత్యక్షంగా, నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మరో ఆరుగురిని వర్చువల్గా మూడో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఈ పది మందికి మే 7 వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు.