Share News

రైల్వేకోచలో స్థానికులకు అధిక ప్రాధాన్యత కల్పించండి

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:40 PM

పంచలింగాల సమీపంలో రైల్వేశాఖ నిర్మిస్తున్న వర్క్‌షా్‌పలో స్థానికులకు అధిక ప్రాదాన్యత కల్పించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు డిమాండ్‌ చేశారు.

రైల్వేకోచలో స్థానికులకు అధిక ప్రాధాన్యత కల్పించండి
రైల్వేజీఎంకు వినతిపత్రం ఇస్తున్న ఎంపీ నాగరాజు

కర్నూలు రూరల్‌ ఏప్రీల్‌ 24(ఆంధ్రజ్యోతి): పంచలింగాల సమీపంలో రైల్వేశాఖ నిర్మిస్తున్న వర్క్‌షా్‌పలో స్థానికులకు అధిక ప్రాదాన్యత కల్పించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా గురువారం కర్నూలు పర్యటనకు వచ్చిన దక్షిణ మద్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైనను ఎంపీ కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ రైల్వేజనరల్‌ మేనేజర్‌ దృష్టికి కర్నూలు జిల్లావ్యాప్తంగా రైల్వేలో నెలకొన్న పలుసమస్యలను తీసుకొచ్చారు. రైల్వేకోచ ప్యాక్టరీని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్‌ నుంచి డోన వరకు నిర్మిస్తున్న డబ్లింగ్‌ పనులను త్వరిగతిన పూర్తి చేయడంతో పాటు కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని జీఎం అరుణ్‌కుమార్‌ జైనను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

Updated Date - Apr 24 , 2025 | 11:40 PM