Share News

Mithun Reddy: విచారణ రికార్డింగ్‌కు ఆదేశించలేం

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:43 AM

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేసిన ఆడియో-వీడియో రికార్డింగ్‌ చేసే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ సందర్భంగా న్యాయవాదులు 10 అడుగుల దూరంలో ఉండేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు, ఆడియో-వీడియో రికార్డింగ్‌ను ఆదేశించేందుకు నిరాకరించింది.

Mithun Reddy: విచారణ రికార్డింగ్‌కు ఆదేశించలేం

మిథున్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు

ఇద్దరు న్యాయవాదులతో సిట్‌ ముందుకు వెళ్లేందుకు అనుమతి

న్యాయమూర్తి స్పష్టీకరణ.. వ్యాజ్యం పరిష్కారం

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తనను విచారించే సమయంలో ఆ ప్రక్రియను ఆడియో-వీడియో రికార్డింగ్‌ చేసేలా ఆదేశించాలన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 19న విచారణకు హాజరైనప్పుడు ఆయనతో ఇద్దరు న్యాయవాదులు సిట్‌ అధికారుల ముందుకు వెళ్లేందుకు అంగీకరించింది. ఆయన్ను విచారించే సమయంలో 10 అడుగుల దూరంలో ఓ న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని సిట్‌ అధికారులకు స్పష్టం చేసింది. అలాగే సిట్‌ విచారణ, వాంగ్మూలం నమోదుకు ఆటంకం కలిగించవద్దని న్యాయవాదులకు తేల్చిచెప్పింది. విచారణ సమయంలో అధికారులు చేయి చేసుకుంటారని, దుర్భాషలాడతారని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపఽథ్యంలో కార్యాలయంలోని సీసీటీవీ కెమెరా కవరేజీ ఉన్న ప్రదేశంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు తనను విచారించే సమయంలో న్యాయవాదులను అనుమతించాలని, ఆడియో-వీడియో రికార్డింగ్‌ చేసేలా వారిని ఆదేశించాలని కోరుతూ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితులను న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు గతంలో ఇదే హైకోర్టు అనుమతించిందన్నారు. సాక్షిగా శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని పిటిషనర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చిందని, తాజాగా ఈ నెల 19న రమ్మని మరో నోటీసు ఇచ్చిందని తెలిపారు. పిటిషనర్‌తో పాటు న్యాయవాదులు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. విచారణ సమయంలో ఆడియో-వీడియో రికార్డింగ్‌ చేయడమనేది దర్యాప్తు అధికారి విచక్షణాధికారమన్నారు. న్యాయవాది పదడుగుల దూరంలో ఉంటే అభ్యంతరం లేదని, కానీ విచారణలో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆడియో-వీడియో రికార్డింగ్‌కు సిట్‌ను ఆదేశించేందుకు నిరాకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:44 AM