Nellore: కుప్పంలో ఉద్యానశాఖ ఏడీ కార్యాలయం
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:50 AM
నెల్లూరు జిల్లా కందుకూరులోని ఉద్యానశాఖ అసిస్టెంట్ డెరెక్షన్ పోస్టును చిత్తూరు జిల్లా కుప్పంకు బదిలీ చేసింది ప్రభుత్వం. కుప్పంలో 37 వేల ఎకరాల ఉద్యాన పంటల విస్తరణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
కందుకూరు ఏడీహెచ్ యూనిట్ తరలింపు
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కందుకూరులోని ఉద్యానశాఖ అసిస్టెంట్ డెరెక్టర్ (ఏడీహెచ్ యూనిట్) ను చిత్తూరు జిల్లా కుప్పానికి తరలిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు ఏడీ పోస్టును కుప్పంకు బదిలీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ (జోనల్) పోస్టును పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి కార్యాలయానికి, జూనియర్ అసిస్టెంట్ పోస్టును ప్రకాశం జిల్లా ఉద్యానశాఖ అధికారి కార్యాలయానికి బదిలీ చేసింది. గతంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కందుకూరులో ఉద్యానశాఖ ఏడీ కార్యాలయాలు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత కందుకూరు ఏడీ నెల్లూరు జిల్లా ఉద్యాన అధికారి నియంత్రణలో పని చేస్తున్నారు. అయితే చిత్తూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో 37 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండటం, భవిష్యత్ ఉద్యాన సాగు విస్తరించే అవకాశం ఉన్నందున అక్కడ మెరుగైన ఫలితాల కోసం ఉద్యానశాఖ డైరెక్టర్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..