Share News

YS Jagan Pulivendula: జగన్‌కు ఝలక్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:53 AM

పులివెందులలో పర్యటించిన వైఎస్‌ జగన్‌ రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా గురించి ప్రశ్నించగా, ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ పెంచిందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో జగన్‌ నిరాశకు గురయ్యారు

YS Jagan Pulivendula: జగన్‌కు ఝలక్‌

ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలా అని రైతులను అడిగిన జగన్‌

ప్రస్తుత ప్రభుత్వం రూ.35 వేలకు పెంచిందన్న ఉద్యాన అఽధికారిణి

సొంత నియోజకవర్గంలో మాజీ సీఎం పర్యటన

పులివెందుల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలో పర్యటించారు. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. మీకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలా.. లేక బీమా ఇవ్వాలా అని అడుగుతుండగా.. అక్కడే ఉన్న ఉద్యాన అధికారిణి సుభాషిణి స్పందించారు. ‘సార్‌.. గతంలో రూ.25 వేలు ఉన్న ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈ ప్రభుత్వం రూ.35,000కు పెంచింది’ అని చెప్పడంతో ఆయ న కంగుతిన్నారు. అనంతరం లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో అరటి తోటలను పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి రైతుల బాగోగులు పట్టడం లేదని, వారిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తోంది.. మరో మూడేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం’ అని జగన్‌ తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. పర్యటనలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:53 AM