ఢిల్లీ హైకోర్టులో ‘నాట్కో’కు ఊరట
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:11 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే నాట్కో ఫార్మాకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ‘రిస్డిప్లాన్’ అనే పేటెంట్ ఔషధాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జెనరిక్ రూపంలో....

ఎస్ఎంఏ ఔషధ తయారీకి గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పని చేసే నాట్కో ఫార్మాకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ‘రిస్డిప్లాన్’ అనే పేటెంట్ ఔషధాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జెనరిక్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు న్యాయమూర్తి జస్టిస్ మినిపుష్కరణ అనుమతించారు. ఈ ఔషధాన్ని ప్రస్తుతం స్విస్ ఫార్మా కంపెనీ రోచే భారత్లో మార్కెట్ చేస్తోంది. వెన్నుపూస, మెదడులోని నరాల క్షీణతకు కారణమయ్యే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధి చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. స్విస్ కంపెనీ ప్రస్తుతం ఈ ఔషధంతో కూడిన ఒక్కో సీసాను రూ.6 లక్షల చొప్పున విక్రయిస్తోంది. ఇరవై కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న ఒక్కో ఎస్ఎంఏ రోగికి ఈ సీసాలోని ఔషధం 12 రోజులకు మాత్రమే సరిపోతుంది. అంటే సంవత్సరానికి 30 సీసాల చొప్పున ఏటా రూ.1.8 కోట్లు కేవలం ఈ ఔషధం కొనుగోలుకే సరిపోతుంది. దీంతో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాట్కో ఫార్మా జెనరిక్ రూపంలో చౌకగా ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News