కేఫిన్టెక్ చేతికి సింగపూర్ కంపెనీ
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:28 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కేఫిన్ టెక్నాలజీస్ తన అంతర్జాతీయ ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కేంద్రంగా పని చేసే...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కేఫిన్ టెక్నాలజీస్ తన అంతర్జాతీయ ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కేంద్రంగా పని చేసే యాక్సెంట్ ఫండ్ సర్వీసెస్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ ఈక్విటీలో 51 శాతం వాటాను 3.47 కోట్ల డాలర్లకు (సుమారు రూ.297.30 కోట్లు) కొనుగోలు చేసింది. మిగతా 49 శాతం వాటానూ వచ్చే ఐదేళ్లలో మూడు సమాన వాయిదా ల్లో కొనుగోలు చేస్తామని కేఫిన్ టెక్నాలజీస్ తెలిపింది. యాక్సెంట్ 18 దేశాల్లోని 260 అంతర్జాతీయ ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిర్వహణ సంస్థలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలు వివిధ పెట్టుబడులకు సంబంధించి 576 ఫండ్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News