‘ఫిక్సింగ్’లో ఫ్రాంచైజీ మాజీ యజమానిపై నిషేధం
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:48 AM
ముంబై టీ20 లీగ్-2019 సందర్భంగా క్రికెటర్లు ధవల్ కులకర్ణి, భవానీ ఠక్కర్ను ఫిక్సింగ్ ఉచ్చులో లాగేందుకు యత్నించిన...
న్యూఢిల్లీ: ముంబై టీ20 లీగ్-2019 సందర్భంగా క్రికెటర్లు ధవల్ కులకర్ణి, భవానీ ఠక్కర్ను ఫిక్సింగ్ ఉచ్చులో లాగేందుకు యత్నించిన.. లీగ్లో సోబో సూపర్ సోనిక్స్ జట్టు ఫ్రాంచైజీ మాజీ సహ యజమాని గుర్మీత్ సింగ్ భమ్రాపై వేటు పడింది. ఈమేరకు గుర్మీత్పై నిషేధం విధిస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్, విశ్రాంత జస్టిస్ అరుణ్ మిశ్రా శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 2019లో ముంబై టీ 20 లీగ్ ఆరంభమైంది. అయితే కొవిడ్ కారణంగా మళ్లీ నిర్వహించలేదు. ఈ ఏడాది తిరిగి లీగ్ను ప్రారంభిస్తున్నారు. కాగా గుర్మీత్పై ఎన్నేళ్ల నిషేధం విధిస్తున్నది మాత్రం వెల్లడించలేదు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..