IPL 2025: టాస్ ఓడిన సన్రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:13 PM
దాదాపు ఏడాది తర్వాత భాగ్యనగరం హైదరాబాద్లో ఐపీఎల్ మజా మొదలైంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. మేఘాలతో కూడిన వాతావరణం కాస్త కలవరపెడుతోంది.

దాదాపు ఏడాది తర్వాత భాగ్యనగరం హైదరాబాద్లో ఐపీఎల్ మజా మొదలైంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. మేఘాలతో కూడిన వాతావరణం కాస్త కలవరపెడుతున్నప్పటికీ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలో స్టేడియంకు చేరుకున్నారు. టాస్ కూడా పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయబోతోంది.
తుది జట్లు:
సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సమిర్ జీత్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శివమ్ ధూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్ మేయర్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫరూకీ
ఇవి కూడా చదవండి..
MS Dhoni: నేను వీల్ఛైర్లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ
IPL 2025: విరాట్తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..