శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్సర్చ్
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:34 PM
శాం తిభద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని మందమ ర్రి సీఐ శశిదర్రెడ్డి అన్నారు. మంగళవారం కోమటిచేనులో కార్డన్ సర్చ్ నిర్వహించి ప్ర జలకు నేరాల నియంత్రణపై అవగాహన క ల్పించారు.
కాసిపేట, ఏప్రిల్22(ఆంధ్రజ్యోతి): శాం తిభద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని మందమ ర్రి సీఐ శశిదర్రెడ్డి అన్నారు. మంగళవారం కోమటిచేనులో కార్డన్ సర్చ్ నిర్వహించి ప్ర జలకు నేరాల నియంత్రణపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామాల్లో ఎవరైన అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగు తుం టే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వా లి, ఎవరుకూడ అపరిచిత వ్యక్తులకు ఆశ్ర యం ఇవ్వరాదని సూచించారు. అనంత రం నంబర్ ప్లేట్లేని 26 ద్విచక్రవాహ నా లు, నాలుగు ఆటోలను గుర్తించి వాటిని అ క్కడిక క్కడే జరిమాన విధించారు. రెండు నంబర్ప్లేట్, పత్రాలు లేని వాహనాలను సీ జ్ చేశారు. సైబర్ క్రైం, గంజాయి నియం త్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కొత్తచట్టాల పై అవగాహన, మూఢ నమ్మకాల గురించిస్థానిక ప్రజలకు వివరిం చారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న దు ర్గం సూర్య ప్రకాశ్, రాంటెంకి అర్జున్లపై ఎక్సయిజ్ కేసు నమోదు చేశామన్నారు. కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూ ర్ ఎస్ఐ ఆంజనేయులు, మందమర్రి, రా మకృష్ణాపూర్ ఎస్ఐలు పాల్గొన్నారు.