కదిలిన వైద్య బృందం
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:19 PM
ఊరంతా కిడ్నీ వ్యాధిగ్రుస్తులే’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి మెయిన్పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి జి ల్లా వైద్యారోగ్యశాఖ స్పందించింది.
మాలగురిజాల గ్రామంలో వైద్య శిబిరం
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
బెల్లంపల్లి, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): ‘ఊరంతా కిడ్నీ వ్యాధిగ్రుస్తులే’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి మెయిన్పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి జి ల్లా వైద్యారోగ్యశాఖ స్పందించింది. శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని మా లగురిజాల గ్రామంలో డిప్యూటి డిఎంహెచ్వో సుధాకర్నాయక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 80మందికి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో పదిమందికి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జి ల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు మాలగురిజాల గ్రా మంలో వైద్యశిబిరం నిర్వహిస్తామన్నారు. నాలుగువైద్య బృందాలతో గ్రామం లోని 250 ఇండ్లను పరిశీలిస్తామన్నారు. రక్తమూత్ర పరీక్షలను నిర్వహించి టీహబ్కు పరీక్షల నిమిత్తం పంపిస్తామన్నారు. అలాగే గ్రామంలోని బోరునీ రును వరంగల్లోని ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో వైద్యురాలు ఎవాంజలిన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వ ర్లు, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ వెంకటేశ్వర్, హెల్త్ సూపర్వైజర్ మల్లి కాంబ, ఎఎన్ఎం చంద్రకళ, ఎపడమిక్ ఇంచార్జీ మురళి, హెల్త్ అసిస్టెంట్ శివగణేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.