నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:31 PM
గ్రామీ ణ ప్రాంతంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్రెడ్డి
బిజినేపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : గ్రామీ ణ ప్రాంతంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షే మ శాఖ గురుకుల పాఠశాలలో బుధవారం కూచకుళ్ల ఫౌండేషన్ ద్వారా ఉచితంగా 10గ్రీన్ బోర్డులను ప్రిన్సిపాల్ సుమతికి అందజేసి మా ట్లాడారు. లట్టుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాని ప్రారంభించి ఽరైతులతో మాట్లాడారు. కార్యక్ర మంలో ఏపీఎం విజయ, మాజీ ఎంపీటీసీలు స భ్యులు మారేపల్లి చంద్రగౌడ్, రామచంద్రయ్య, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్మండల అధ్యక్షుడు మిద్దె రాములు, వెంకటస్వామి, హరీష్రెడ్డి, మాజీ సర్పంచులు మస్కూరి అవంతిశంకర్, అమృత్ రెడ్డి, గోవిందు నాయక్, తిరుపతయ్య, మిద్దె శ్రీశైలం, బంగారి పర్వతాలు, మాన్యనాయక్, లేట్ల బాలస్వా మి, సైదులు, నరేందర్ గౌడ్, ఖలీల్ ఉన్నారు.
సీసీ రోడ్డుకు భూమి పూజ
తెలకపల్లి : మండల పరి ధిలోని గౌతంపల్లిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రా జేశ్రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ స ర్పంచ్ యాదవరెడ్డి, మాజీ కౌన్సి లర్లు, గ్రామ నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాడూరు : మండలంలోని ఎట్టిధార్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించా రు. కార్యక్రమంలో డైరెక్టర్లు, సంఘ సిబ్బందితో పాటు మండలంలోని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.