Home » LATEST NEWS
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లో పార్టీ పండుగను సందడిగా జరుపుకున్నాయి.
తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబైపై విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు.
జిల్లాలో అరకులోయ, చింతపల్లి మండలాల్లో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 7వ తేదీన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో 20 వేల మంది బాలబాలికలతో 108 సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ తెలిపారు.
తెలుగు వారికి సంవత్సరాది ‘ఉగాది’ పండుగను ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు.
సారా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రమైన పగిడ్యాల మజార గ్రామమైన ఆంజనేయనగర్ సమీపంలో గొర్రెలు తొక్కిసలాటలో శనివారం 140కి పైగా గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు మోహన్, సుధాకర్, బాలస్వామి తెలిపారు. వివరాలివీ.. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సగినేనిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సుమారు 900 గొర్రెలను మేత కోసం జనవరి నెలలో పగిడ్యాలకు వచ్చారు.
మహానంది క్షేత్రంలో ఏడాది పాటు కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్వహణ వేలంలో రూ.27.50 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాల్లోని షాపులతో పాటు ఖాళీ స్ధలాలకు మూడు సంవత్సరాల కాల పరిమితి కింద శనివారం బహిరంగ వేలాలను స్ధానిక పోచా విశ్రాంతి భవనంలో నిర్వహించారు.
తెలుగు దేశం పేదల కోసం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే శ్యాం బాబు అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం సుంకంగేట్, తేరుబజార్ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థాపించిన ఏడాదిలోపే ఎన్టీఆర్ పార్టీని ఆధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు.
Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
Gunfire In Hyderabad: హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
యూట్యూబర్ శంకర్ను అంబర్పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.
మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్కు వినతిపత్రం సమర్పించారు.
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.