Home » LATEST NEWS
మార్చి 25న ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరుకావాలంటూ తొలుత ముంబై పోలీసులు కామ్రాకు నోటీసులిచ్చారు. స్టాండప్ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంఐడీసీ పోలీసులు ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణను ఖర్ పోలీసులకు అప్పగించారు.
IPL 2025 Match Predictions: ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ క్లాష్కు అంతా రెడీ అయింది. బోణీ కొట్టేందుకు ఎదురు చూస్తున్న రెండు బిగ్ టీమ్స్ మధ్య ఇవాళ ఆసక్తికర సమరం జరగనుంది. ఆ జట్లే కేకేఆర్-ఆర్ఆర్.
Business Idea : ఉద్యోగావకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా లేదా చేస్తున్న జాబ్ వదిలేసి సొంతంగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐడియా మీకోసమే..పరోక్షంగా భారతీయ రైల్వేకు సేవలందిస్తూ ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించే మార్గముందని మీకు తెలుసా..
CM Chandrababu Orders: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది.
KKR vs RR IPL 2025: కోల్కతా నైట్ రైడర్స్ సారథి అజింక్యా రహానేకు అవమానం ఎదురైంది. అతడు జట్టు సారథి అనేది కూడా పట్టించుకోకుండా పిచ్ క్యూరేటర్ బిహేవ్ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.
పీఆర్పీ చికిత్స ఓ స్కామ్ అని తెలంగాణకు చెందిన పలువురు ఆర్థొపెడిక్ సర్జన్లు స్పష్టం చేశారు. వైద్య ప్రయోజనాలు లేని పీఆర్పీని చికిత్సగా ప్రచారం చేయడం అనైతికమంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు.
అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని దేశం నుంచి బహిష్కరించడమే కాక.. అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచుతుంది. ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి వేస్తుంది. ఈ క్రమంలో ఓ జంటను ఇలానే అమెరికా నుంచి బహిష్కరించి.. దేశం నుంచి పంపించివేసింది ట్రంప్ సర్కార్. ఆ వివరాలు..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు స్నేహితులు కారులో ఫారెస్ట్ రైడ్కు వెళ్తుంటారు. ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. మరో వ్యక్తి అడవి జంతువులను వీడియో తీసుకుంటుంటాడు. ఇంకో వ్యక్తి మధ్యలో కూర్చుని ఆసక్తిగా గమనిస్తుంటాడు. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ క్లాక్ కూడా దాగి ఉంది. దాన్ని 15 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సొంతపార్టీ (వైసీపీ)నేతను ఆ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీటీసీలు కూడా కనిపించకపోవడంపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gurus Curse: గురువు మహిమ చాలా గొప్పది. గురు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు. గురువు మాటను ధిక్కరించవద్దు. గురువు శాపంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వీడియోలో చూద్దాం.
మైనార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ.. వారిని ఆకట్టుకోవడం కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పండుగ సందర్భంగా మైనార్టీలకు కానుక ఇచ్చేందుకుగాను సౌగత్ ఎ మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. మరికొన్ని బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతోంది. కాగా ఈరోజు సభను సాయంత్రం 5 గంటలకే వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
హైదరాబాద్కు చెందిన ఎన్.సునీల్రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్కి తరలించిన కీలకపత్రాలను లావు శ్రీకృష్ణదేవరాయలు, అమిత్ షాకు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఒకప్పుడు అవకాశాల స్వర్గం. సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు పరిస్థితి మారిందా. అమెరికా వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారా. డోనాల్డ్ ట్రంప్ వల్ల పర్యాటక రంగానికి 65 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ నష్టం జరుగనుందా. అసలు అమెరికాకు ఏమైంది. ఒకప్పుడు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దేశాల జాబితాలో తొలి స్థానంలో అమెరికా ఉండేది.
హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాకలో దోమల బెడదను నివారించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దోమల బెడదతో కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండగా.. మరికొందరు సాయంత్రం అయితే చాలు.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని బల్దియా అధికారులపై మండిపడుతున్నారు. నగర వాసులను ఈ దోమలు బెంబేలెతిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. అందులోభాగంగా జస్టిస్ వర్మ నివాసాన్ని త్రి సభ్య కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని సదరు కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం నాడు కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ రామోజీరావు, డిచ్పల్లి ఎస్ఐ రఫీ పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి పత్రిక పాఠకుల కోసం కార్ అండ్ బైక్ రేస్ను సంస్థ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు లక్కీ కూపన్ల డ్రా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి,మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు.
Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.
జగన్మోహన్ రెడ్డి భారీ లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్థదేవరాయలు అన్నారు. రూ. 18వేల 5 వందల కోట్లపైచిలుకు అవినీతి జరిగిందంటూ ఆయన పార్లమెంట్లో చెప్పారు. రూ. 4 వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు తరలించారని అన్నారు.