Home » 2025
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
సత్యసాయిబాబా శత జ యంతి ఉత్సవాల సంద ర్భంగా పేద విద్యార్థుల కు రూ.4లక్షలు విలువ చే సే సైకిళ్లను, దివ్యాం గుల కు వీల్ చైర్లను, మహి ళలకు కుట్టుమిష న్లు లండనకు చెందిన స త్యసాయి బాబాభక్తులు చంద్రసోదా, అనిల్సోదా, యాస్, గంట్రా సమకూ ర్చారు. వాటిని ఆదివారం స్థానిక ఆర్డీటీ కార్యాల యంలో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో పంపిణీచేశారు.
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని కేశవనగర్లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
దారులు, ప్రభుత్వ భూములేకాదు తుదకు వంకలు, వాగులను కూడా వదలడంలేదు. కా లువల పక్కన కొంత భూమి ఉంటే... ఆ భూమితో పాటు కాలువ ఉన్న భూమినే కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జాదారుల కన్నుపడితే ఏదీ వదలరనే విమర్శలు వినవస్తు న్నాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లినపప్పుడు ఆ నీరు వెళ్లేందుకు వంకలు, వాగులు ఉండేవి.
మండల పరిధిలోని గొడ్డువెలగల పంచా యతీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. తుమ్మల బైలు నుంచి గొడ్డువెలగల పంచాయతీకి గతంలో తారు రోడ్డు వేశారు. గొడ్డు వెలగల సమీపాన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు సిమెంట్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శని వారం కదిరి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
పట్టణంలోని కేశవనగర్లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
అభివృద్ధి, సంక్షేమం డబుల్ ఇం జన సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొ న్నారు. అలాగే ముందుకెళ్తున్నా మని అన్నారు. మండలపరిధిలోని కౌలేపల్లి వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)ని ఆ యన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో ఎన్డీఎ పాలనలో రెండు ఆర్వోడీలు మంజూరయ్యాయని, వా టిని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎన్నేళ్లు... ఇలా ప్రైవేటు భవ నాల్లో ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తారని ఆ గ్రామ స్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా, విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రగాల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. మండలపరిధిలోని ఎర్రగుంటపల్లిలో ఈ పరిస్థితి కనిపి స్తుంది.