Home » 2025
నేటి పిల్లలే రేపటి పౌరులని, పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మునిసిపల్ పరిధిలోని బీడుపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల, అమడగూరు మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా పీటీఎం కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన మెగా పీటీ ఎం సమావేశానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల కేంద్రంలోని దొరి గల్లు రోడ్డులో వెలసిన పంచగిరీఊ అయ్యప్ప స్వామి గ్రామో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజనలు, అయ్యప్ప కీర్తనలతో స్వామి దేవస్థానం వద్ద నుంచి ముదిగుబ్బ వీధులలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిం చారు.
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.
పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.