Home » 2025
రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
స్థానిక ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్ శర్మ హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.
మండల పరిఽధిలోని కటారుక్రాస్లోని రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్స, డీఎంహెచఓకి సూచించారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.