Home » Adilabad
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండంలో పులి అడుగులను గుర్తించారు. ఈ గ్రామం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులో ఉంది. అయితే... ఈ సరిహద్దులో దట్టమైన అడవితోనాటు వార్ద నది కూడా ఉంది. కాగా... నది ఒడ్డున పులి పాదముద్రలను గుర్తించారు. దీంతొ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తుంది. తొలివిడత ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంటుంది. శనివారం రెండవ విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతం మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
చలిపులి చంపేస్తోంది. గత మూడురోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. జిల్లాలోని సాత్నాలలో 10.0 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం చలి పెరగడంతో ప్రధానంగా చిన్నపిల్లలు, వయసు పెరిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
అడవుల్లో విస్తారంగా పెరిగే ఇప్ప చెట్ల మీద పూలను మేం తాకం. అవి కింద రాలిపోయిన తరువాతనే ఏరుకుంటాం. చెట్లమీద పూలను తాకితే పులి వస్తుందని మా గోండు గిరిజనులు గట్టిగా నమ్ముతారు. అందుకే కట్టెతో కూడా వాటిని ముట్టుకోరు’’ అంటాడు ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరులో ‘ఆదివాసీ ఆహార కేంద్రం’ నిర్వహిస్తున్న కుమ్రా విఠల్రావు.
గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.
ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..