Home » Adilabad
రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. జూన్ 4న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకు లతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగి సిన అనంతరం ధాన్యానికి క్వింటాళుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా మనడం రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు.
ఆర్ఎంపీ, పీఎంపీల చికిత్స కేంద్రాలపై స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తూ వేధింపులకు గురి చేయడం సరైంది కాదని తెలంగాణ అనుభవ వైద్యుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్శి రవీందర్లు పేర్కొన్నారు.
జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డెంగ్యూ నివారణ మా బాధ్యత- సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యా ప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి ఆర్డీవో రాములు, డీఆర్డీవో కిషన్, జిల్లా పౌరసరపరాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్రూంలకు తరలించగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన ఎంపీ అభ్యర్థులు మంగళవారం రిలాక్స్ అయ్యారు. లోక్సభ ఎన్నికల సందడి ముగియడంతో ప్రధాన పార్టీలై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, శ్రీనివాస్ గొమాసే, కొప్పుల ఈశ్వర్ ఇళ్లకే పరిమితమయ్యారు.
లోక్సభ ఎన్నికలు జిల్లా లోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెం ట్లలో సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
స్ర్టాంగ్రూంల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్రూంను ఆయన పరిశీలించారు.
మంచిర్యాల- అంతర్గాంలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని వంతెన సాధన సమితి నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని కాలేజీ రోడ్డులో బ్రిడ్జి నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్కు వినతిపత్రం అందించారు.