Home » Adilabad
ప్రధాని మోదీ వేసవి ప్రారంభంలో జల సంరక్షణకు ప్రజలను పిలుపునిచ్చారు. నీటిని పొదుపు చేయడానికి గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సంరక్షణ చేసినట్టు తెలిపారు
ఓ కేసు విషయంలో మెడికల్ షాపు యాజమాని నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డీఈఎంవో) రవి శంకర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
తన కూతురుతో మాట్లాడుతున్నాడనే కోపంతో తండ్రి ఆ యువకుడిని బంధించి.. నగ్నంగా చేసి చిత్రహింసలు పెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన.
వర్షాకాలంలో పచ్చదనంతో కనులవిందు చేసిన ఆ చెట్లు నేడు తలవాల్చాయి. వాన నీటిని ముద్దాడి మట్టి సువాసన వెదజల్లిన అదే భూమి నేడు వేసవిలో దాహార్తితో చిట్లిపోయింది.
అప్పటి వరకు హాస్టల్లోని తోటి విద్యార్థినులతో సరదాగా గడిపిన బాలిక.. కొద్ది సేపటికే విగత జీవిగా మారింది. రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన ఆ విద్యార్థిని.. తెల్లారేసరికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
ఊరి కోసం ఎంతో చేయడమే కాక, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ఆ ఊరంతా ఒక్కటైంది. ప్రాణాపాయంలో ఉన్నది ముస్లిం అయినా సరే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.
ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. 32 ఏళ్ల వయస్సు ఉన్న అతని కుమారుడు.. తమ పక్కింటిలో ఉండే నిండా 13 ఏళ్లు లేని ఓ బాలిక పట్ల కీచకులుగా మారారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారి అని కూడా చూడకుండా వేర్వేరుగా అత్యాచారానికి తెగబడి ఆ బాలిక బాల్యాన్ని చిదిమేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో తోయగూడ గ్రామస్థులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలా ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది.