Home » Amaravati
యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.
ఆయన.. కారు కనిపిస్తే చాలు... రాళ్లేసి అద్దాలు పగులగొడతాడు.. ధ్వంసం చేస్తాడు. అయితే.. అతను ఇలా చేయడాని కారణం అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడమేనని తెలుస్తోంది. స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.
ఒకవైపు తుఫాన్ హెచ్చరికలతో.. పొలాల్లో హార్వెస్టర్లు పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు విరామం లేకుండా కోత కోసేస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాలపై ఆరబెట్టే పనికూడా లేకుండా అన్నదాతలు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండు, మూడు రోజుల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.
నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధర భారీగా పెరిగింది.
ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది.