Home » Amaravati
పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
కర్ణాటక సరిహద్దులోనే మండలం ఉంది. కర్ణాటకలో మద్యంతాగి.. మండలానికి చెందిన యువకులు ఊగుతున్నారు. సరిహద్దు దాటి అవతలికి వెల్లి పూటుగా మద్యం తాగుతున్నారు. అదే మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ మండలంలోకి వస్తున్నారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్కు వచ్చింది.
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.
నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా శ్రవణ్(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
ఏదైనా సాధించాలన్న తపన ఆ యువతిని కిలిమంజారో పర్వత శిఖరాలపైకి తీసుకెళ్లింది. పర్వతంలో రాళ్లు, గుండ్ల కంటే.. జీ వితంలోనే ఎక్కువగా కష్టాలను అధిగమించింది. నిరుపేద కుటుంబంలో పుట్టింది. కూలికెళ్తేనే కుటుంబం గ డుస్తుంది.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.