Home » Anantapur urban
సామాన్య గృహిణాగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థల అధినేతగా, రాజకీయరంగంగా, సంఘసేవకురాలుగా సేవాలందించిన స్ఫూర్తిదాత అని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలలు, రెసిడెన్షియల్, గురుకల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని ఉ పాధ్యాయులకు కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియలో అవినీతికి పాల్పడిన డీసీఓను వెంటనే సస్పెండ్ చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని 200 మంది దళిత విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీతో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.
అనంతపురం నగరానికి అండర్ డ్రైనేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థి దశనుంచే క్రీడల్లో పాల్గొనే ఆసక్తిని పెంచుకోవాలని ఎస్కేయూ ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత పేర్కొన్నారు
అధ్యాపకులు నిత్య పరిశోధకులుగా కొత్త అంశాలను ఎప్పటికప్పుడు శోధించాలని జేఎనటీయూ ఇనచార్జి వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు సూచించారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ సెమినార్ హాల్లో ఫ్యాకల్టీ డెవల్పమెంట్ ప్రోగ్రాం(ఎ్ఫడీపీ) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎఫ్డీపీకి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమస్యలు పరిష్కారించాలని సత్యసాయి తాగునీటి కార్మికుల గతవారం రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. కల్లూరు పంపుహౌస్ వద్ద బుధవారం సత్యసాయి బాబా చిత్రపటాన్ని ముందు పెట్టుకుని బిచ్చమెత్తుకుంటూ వినూత్న నిరసన తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడీ పై పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ఎంపీఈఓలను తిరిగి ఉమ్మడి అనంత జిల్లాకు పంపించాలని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్కు ఎంపీఈఓల సంఘం నాయకులు కోరారు.
అనంతపురం నగరంలో నడిమి, మరువ వంకలకు రక్షణ గోడల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి దగ్గుపాటి మంత్రికి వినతి పత్రం అందజేశారు.
నగర శివారులోని పీవీకేకేఐటీలో ఎలకి్ట్రక్ వెహికల్ టెక్నాలజీ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవల్పమెంట్ శిక్షణ కార్యక్రమం(ఎ్ఫడీపీ) సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా జేఎనటీయూ కళాశాల డా. విజయక్కుమార్ హాజరయ్యారు.