Home » Anantapur
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు.
విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ట్ర యిల్ ఫోర్ కస్తూర్బా పాఠశాల(కేజీ బీవీ) సిబ్బందికి జీసీడీఓ అనిత సూచించారు. మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల వసతి గృహం లో విద్యార్థినులతో వంట పనులు, కూరగా యలు కోయడం, వాటర్ క్యానలు మోయించ డం వంటి పనులు చేయిస్తున్నారని, సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నా యని జీసీడీఓ అన్నారు.
సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చిత్రావతి సుందరీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటకనాగేపల్లి సత్యసాయి పార్క్ నుంచి దుర్గాదేవి ఆలయం వరకు దాతల సహకారంతో పూలమొక్కలను నాటారు. మొక్కలైతే నాటారు కాని వాటికి నీరు పోయడం మరిచిపోయారు. దీంతో ఆ మొక్కలు కాస్తా ఎండిపోతున్నాయి.
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
సత్యసాయిబాబా శత జ యంతి ఉత్సవాల సంద ర్భంగా పేద విద్యార్థుల కు రూ.4లక్షలు విలువ చే సే సైకిళ్లను, దివ్యాం గుల కు వీల్ చైర్లను, మహి ళలకు కుట్టుమిష న్లు లండనకు చెందిన స త్యసాయి బాబాభక్తులు చంద్రసోదా, అనిల్సోదా, యాస్, గంట్రా సమకూ ర్చారు. వాటిని ఆదివారం స్థానిక ఆర్డీటీ కార్యాల యంలో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో పంపిణీచేశారు.
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని కేశవనగర్లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
దారులు, ప్రభుత్వ భూములేకాదు తుదకు వంకలు, వాగులను కూడా వదలడంలేదు. కా లువల పక్కన కొంత భూమి ఉంటే... ఆ భూమితో పాటు కాలువ ఉన్న భూమినే కబ్జాచేసి భవనాలు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంలో కబ్జాదారుల కన్నుపడితే ఏదీ వదలరనే విమర్శలు వినవస్తు న్నాయి. ఒకప్పుడు చెరువులు, కుంటలు పొంగిపొర్లినపప్పుడు ఆ నీరు వెళ్లేందుకు వంకలు, వాగులు ఉండేవి.