Home » Anantapur
మండల పరిధిలోని గొడ్డువెలగల పంచా యతీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. తుమ్మల బైలు నుంచి గొడ్డువెలగల పంచాయతీకి గతంలో తారు రోడ్డు వేశారు. గొడ్డు వెలగల సమీపాన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు సిమెంట్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శని వారం కదిరి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
పట్టణంలోని కేశవనగర్లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
అభివృద్ధి, సంక్షేమం డబుల్ ఇం జన సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొ న్నారు. అలాగే ముందుకెళ్తున్నా మని అన్నారు. మండలపరిధిలోని కౌలేపల్లి వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)ని ఆ యన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో ఎన్డీఎ పాలనలో రెండు ఆర్వోడీలు మంజూరయ్యాయని, వా టిని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎన్నేళ్లు... ఇలా ప్రైవేటు భవ నాల్లో ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తారని ఆ గ్రామ స్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా, విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రగాల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. మండలపరిధిలోని ఎర్రగుంటపల్లిలో ఈ పరిస్థితి కనిపి స్తుంది.
నేటి పిల్లలే రేపటి పౌరులని, పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మునిసిపల్ పరిధిలోని బీడుపల్లి జిల్లా పరిషత ఉన్నతపాఠశాల, అమడగూరు మండలకేంద్రంలోని మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా పీటీఎం కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన మెగా పీటీ ఎం సమావేశానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల కేంద్రంలోని దొరి గల్లు రోడ్డులో వెలసిన పంచగిరీఊ అయ్యప్ప స్వామి గ్రామో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజనలు, అయ్యప్ప కీర్తనలతో స్వామి దేవస్థానం వద్ద నుంచి ముదిగుబ్బ వీధులలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిం చారు.