Home » Andhrapradesh
దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.
యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.
లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధర భారీగా పెరిగింది.
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది.
పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా శ్రవణ్(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.