Home » AP Govt
హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు.
వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు.
విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనిల్ చోకరాని సిట్ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఏపీకి తీసుకువచ్చి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేథోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.