Home » AP Govt
విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.