Home » AP Govt
ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రోడ్ల అభివృద్దికి రూ.2800 కోట్లని కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యా విప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ బాషాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.