Home » AP Police
ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెల రికవరీ మేళా జరిగింది. ఈ క్రమంలో రికవరీ మేళా వివరాలను విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెలలో 75 చోరీ కేసులను ఛేదించామని సీపీ శంఖ బ్రాత బాగ్చి తెలిపారు.
బత్తుల ప్రభాకర్ను పట్టుకోవడానికి పోలీసులకు కమిషనర్ రాజశేఖర బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కుంబా కోటేశ్వర రావు నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు.
అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
మచిలీపట్నం పోలీసు స్టేషన్లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. PMLA కింద ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. దేశ వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేశారు.