Home » AP Politics
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.
గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఏపీ కేబినెట్ సమావేశాన్ని నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోట్ విడుదల చేసింది.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.