Home » AP Politics
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాలు చేసుకుంటారా.. లేదా ఐదు కోట్ల సంతకాలు చేసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తున్నామని రఘురామ విమర్శించారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని యామిని శర్మ హితవు పలికారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశాను తన క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రమేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. పరవాడలో జరిగిన కల్తీ మద్యం డంపింగ్ గుర్తించిన వెంటనే.. మీడియా సమక్షంలో ఎక్సైజ్ అధికారులకు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశాల ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.