Home » Arrest
పోలీస్గా చెప్పుకొని బెదిరిస్తూ దారిదోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతరరాష్ట్ర దొంగను సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు(City Task Force Police) అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్(Nigerian)తోపాటు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ), బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం(CCS Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కె.శ్రీనివాస్రెడ్డి(CP K. Srinivas Reddy) కేసు వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను సుల్తాన్బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్గా సాగుతున్న ఈ ఎపిసోడ్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను డ్రగ్ పెడ్లర్గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసులో.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు..
కోల్కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
ట్రావెల్ బస్సులు, దారిదోపిడీలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న థార్ గ్యాంగ్(Thar Gang) ఆటను తెలంగాణ పోలీసులు కట్టించారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు గ్యాంగ్లను కటకటాల్లోకి నెట్టారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన థార్, కంజర్ఖేర్వా గ్యాంగ్లను అరెస్ట్ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..
తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు...
జీహెచ్ఎంసీ(GHMC)కి చెందిన నలుగురు ఉద్యోగులు ఫోర్జరీ, చీటింగ్ కేసులో బుధవారం అరెస్టు అయ్యారు. లేని ఆస్తులకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి రూ.5.78 కోట్ల విలువైన టీడీఆర్(ట్రాన్స్ఫర్ డెవల్పమెంట్ రైట్స్)లు పొందిన వారికి సహకరించారన్న ఆరోపణలపై రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) ఈ చర్యలు తీసుకున్నారు.
డ్రగ్స్ రవాణా, విక్రయం, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ సరఫరా చేస్తున్న తండ్రీకుమారులని మహేశ్వరం ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు.