Home » Assembly elections
ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ తెలిపారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
బీహార్లోని 60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అయ్యే ప్రసక్తి లేదని గతవారంలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మార్పును కోరుకుంటున్న 60 శాతం ప్రజలు ఎవరికి ఓటు వేయనున్నారనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అన్నారు.
బీజేపీ, ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు బిహార్ అసెంబ్లీకి ఈఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి మహా కూటమి(మహా ఘట్బంధన్) నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా జనతాదళ్ (యూ), బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు పనిచేశారు. తాజాగా ఆయన బీహార్లో జరిపిన సర్వే వివరాలను వెల్లడిస్తూ, 62 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తాను, తన టీమ్ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందని అడిగిన ఒక ప్రశ్నకు ద్రవిడ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి పేరును ప్రస్తావించకుండా అమిత్షా సమాధానమిచ్చారు.
ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు.
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.