Home » Assembly elections
‘నవీన్యాదవ్పై బీఆర్ఎస్, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్గూడ బస్తీకి చెందిన వజీర్ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
ప్రచారం బాగా చేశాం. కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఇంటింటికి తిరిగినం. ఓటర్లకు తాయిలాలు కూడా భారీగానే అందించాం. పోలింగ్ రోజున తమకు ఓట్లు కూడా బాగానే పడ్డాయని ఆశిస్తున్నాం. ఇక మీ దయ.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా కరుణించండి..’’ అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.
ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్ఫగూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్సీ)సెంటర్గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్రూమ్ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.