Home » Assembly elections
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓటు బ్యాంక్లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.
రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆరోపించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఐఆర్పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.
కరూర్ రోడ్షోలో 41 మంది దుర్మరణం సంఘటన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కరూర్ మృతుల కుటుంబ సభ్యులను మహాబలిపురం రిసార్ట్కు రప్పించి వారికి క్షమాపణ చెప్పి, గాయపడిన వారికి తలా రూ.2లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
కరూర్ రోడ్షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్నే కారణమని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్ ఆరోపించారు.
వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్ జోస్యం చెప్పారు.
గత నెలలో కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్లో రోడ్షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్ పరామర్శించారు.
తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు.