Home » Australia
క్రికెట్ అంటే ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎక్కువ గా కనిపిస్తుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో అయితే ఆ జట్టు చెలరేగిపోతుంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అంటే పూనకం వస్తుంది. వాళ్లను ఆపడం అంత ఈజీగా కాదు. మహిళా ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఆసీస్ కు రికార్డు ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎలాగైనా ఆసీస్ ను ఓడించి.. ఫైనల్ కు చేరాలని టీమిండియా కసిగా ఉంది. అది అంత ఈజీ కానప్పటికీ... కాస్తా శ్రమిస్తే సుసాధ్యం అవుతుందని క్రీడా నిపుణుల చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే... ఈ మ్యాచ్ వాన గండం ఉంది.
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
‘మేల్ హంప్బ్యాక్ డాల్ఫిన్లు’ అంతరించి పోతున్న జాతిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువ ఉంది. వాటిని పరిరక్షించటం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలనం సృష్టించింది. నిన్న(శనివారం) ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో అదరగొట్టింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఆమె దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ క్యూకట్టారు.
సిడ్నీ వన్డేలో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తాము ఇక ఆడతామో లేదో తెలియదన్నాడు.
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆకతాయి వేధించినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అసహనం వ్యక్తం చేశారు.
సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.