Home » AV Ranganath
ఎన్.. కన్వెన్షన్ నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝులిపించిన సంగతి తెలిసిందే...
హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్ను మెచ్చుకుంటూ ఉండగా..
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు...