Home » Bengaluru News
ధర్మస్థళలో పుర్రె వివాదం సంచలనం కలిగిస్తుండగా నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోవిందశెట్టిపాళ్య చెత్తకుప్పలో మనిషి పుర్రెతోపాటు ఎముకలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై, పదవులను కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి రైతులపై కానీ, ప్రాజెక్టులపై కానీ లేదని ప్రతిపక్షనాయకులు అశోక్ మండిపడ్డారు. సోమవారం తుంగభద్ర డ్యామ్ను బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది.
మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.
మైసూరు దసరా ఉత్సవాలు దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్ప్రైజ్ విజేత బానుముస్తాక్ ప్రారంభించనున్నారు.
ధర్మస్థల పుణ్యక్షేత్రంపై అనవసర ఆరోఫలు చేయడం తగదని బీజేపీ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి నేతృత్వంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా రాయల్ సర్కిల్లో మానహారం ఏర్పడి ధర్మస్థలపై ఆరోపణలు చేయడం మంచిది కాదని నినదించారు.
ఊహించినట్టుగానే మహిళల వన్డే వరల్డ్కప్లో భాగంగా బెంగళూరులో జరగాల్సిన ఐదు మ్యాచ్లను తరలించారు. చిన్నస్వామి స్టేడియంలో వీటి నిర్వహణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంలో అక్కడి క్రికెట్ సంఘం..
రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శుక్రవారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ జిల్లాల జిల్లాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.
నగరంలోని శ్రీరామ నగర్ పరిసరాల్లో సోమవారం బాలిక అక్కనాగమ్మతోపాటు మరో నలుగురు వ్యక్తులు రంగణ్ణ, మంజునాథ్, పూజాల పై నక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఆహారం కోసం వెతుకుతూ నగరంలోకి ప్రదవేశించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పరిసరాల్లో ఆడుకుంటున్న బాలికపై నక్క దాడి చేస్తు పక్కనే ఉన్న వ్యక్తుల పై కూడా దాడికి దిగింది.