Home » BJP
ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. అవి ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా రాజాసింగ్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా తాను కూడా సొంతింటికి వెళ్లాల్సి వస్తుందని చెబుతూ అసలు విషయం బయటపెట్టాడు. తాను మళ్లీ బీజేపీలో చేరనున్నట్లు హింట్ ఇచ్చేశాడు. అలాగే పార్టీ పెద్దలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎక్కడుంటే దానం అక్కడకు మకాం మార్చుతారు.. అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్నారని చింతల విమర్శించారు.
అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్లకు నాడు వాజ్పేయి సహకారం అందించారని గుర్తుచేశారు.
మాజీ ప్రధాని, దివంగత నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ జీవితం తెరిచిన పుస్తకం అని.. ప్రతి పేజీ స్ఫూర్తి దాయకం అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్పేయ్ నిరంతరం కృషి చేశారని చెప్పారు.
గోవా అభివృద్ధి దిశగా ఎన్డీయే చేస్తున్న ప్రయత్నాలకు ప్రజాతీర్పు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పునరకింతమవుతుందని ప్రధాని పేర్కొన్నారు.
జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ-ఎంజీపీ (ఎన్డీయే) కూటమి నుంచి గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి మరోసారి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రోజుల క్రితం కేసీఆర్కు మోదీ ఒక చీటీ పంపారని, చీటీలోని పనిని చేయడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకి వచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ట్రెండ్స్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.