Home » BJP
హరీష్ రావు చేతిలోకి బీజేపీ వెళ్లిందని సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హరీష్, ఈటల రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని అన్నారు.
హిల్ట్కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల సేకరణ కాదు.. రామకోటి రాస్తే మేలు.. అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఎద్దేదా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనో భావాలని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.
బీఎల్ఓ ఆత్మహత్య నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం చేస్తున్న ప్రకటనలకు విశ్వసనీయత లేదని బీజేపీ మండిపడింది. స్వతంత్ర దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. అందులో బీజేపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.