Home » BJP
రిటైర్మెంట్కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరెస్సెస్ సర్సం్ఘచాలక్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.
భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చిన బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ ప్రగతినగర్లో నివసిస్తున్న మెతుకుపల్లి రవీందర్రెడ్డి కుమారుడు రిత్విక్రెడ్డికి, ఎల్బీనగర్కు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కుమార్తె ఆకాంక్షరెడ్డితో వివాహం జరిగింది.
తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు.
పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.