Home » BJP
ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.
ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వీరందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్లో ఎన్నికల పండుగ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 4రోజులే మిగిలిఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. జనసమీకరణ కోసం ఒక్కో వ్యక్తి రూ.400 నుంచి రూ.500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కింది కథనంలో చదవండి.
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవడంలో డీఎంకే ప్రభుత్వ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు.
పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రు దేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఎంపీకి బెదిరింపు ఫోన్ రావడంపై ఆయన సెక్రటరీలు శివం ద్వివేది, పవన్ డూబే నేరుగా గోరఖ్పూర్ సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలర్పై చర్చలు తీసుకోవాలని, ఎంపీకి భద్రత పెంచాలని కోరారు.